అయిజ, మే 28 : నడిగడ్డ ప్రజానాయకుడు దివంగత నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. 40 ఏండ్ల్లు నడిగడ్డ అభివృద్ధికి తిరుమల్రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశాడన్నారు. నాయకులు, కార్యకర్తలకు అహర్నిశ లు అందుబాటులో ఉంటూ ఎంతో సేవచేశాడని కొ నియాడారు. మంగళవారం మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో పులకుర్తి తిరుమల్రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే విజయుడు తిరుమల్రెడ్డి సతీమణి, అలంపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ సువర్ణమ్మతో కలిసి తిరుమల్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుమల్రెడ్డి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఉమ్మడి జిల్లా ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడిగా ప్రజలకు ఎన్నో సేవలందించారన్నారు. అయిజ మండలాభివృద్ధే ధ్యేయంగా పనిచేశాడన్నారు. తిరుమల్రెడ్డి మన మధ్యలేకపోయి నా ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయన్నారు.
ప్రమాదాల బారినపడుతున్న క్షతగాత్రులకు రక్తం దానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు యువతకు పిలుపునిచ్చాడు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో తిరుమల్రెడ్డి జయంతిని పురస్కరించుకొని సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సంకాపురం రాముడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబి రం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రా రంభించగా దాదాపు 240మంది రక్తం దానం చేశా రు. అనంతరం మండలంలోని 10జెడ్పీహెచ్ఎస్లల్లో పదో తరగతిలో మొదటి, ద్వితీయ గ్రేడ్లు సా ధించిన విద్యార్థిని, విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించి, తెలుగు, ఇంగ్లిష్ నిఘంటువులను అందజేశారు. అంతకుముందు జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశా రు. కార్యక్రమంలో ము న్సిపల్ వైస్చైర్మన్ మాల నర్సింహులు, నాయకులు సీఎం సురేశ్, రామచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, పల్ల య్య, త్రివిక్రమ్రెడ్డి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రా మస్తులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 28 : బాలసదనంలోని ఆశ్రమం పొందుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనంలో అడ్డాకుల మం డల కేంద్రానికి చెందిన మానస, అక్షిత కొన్ని రోజులుగా ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వీరిద్దరూ పారిపోయినట్లు బాలసదనం ఇన్చార్జి యాదమ్మ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.