మరికల్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మ హరాజ్ జయంతి ఉత్సవాలను మండల కేం ద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. యువక మండలి, ఛత్రపతి శివాజీ యువసేన, ఏబీవీపీ, బజరంగ్దళ్, వీహెచ్పీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. తీలేరులో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచారు. అప్పంపల్లి, కన్మనూర్ లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. మద్వార్లో జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బ జరంగ్దళ్ నాయకులు రవి, రాజు, అనిల్కుమార్రెడ్డి, శివాజీ యువసేన నాయకులు రా జు, రాజేశ్, నరేశ్, నిఖిల్, యాదయ్య, రాంప్రకాశ్గుప్త పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి భారత దేశ వీతత్వాన్ని చాటారని ఆయాగ్రామాల యువజన సంఘల నాయకులు పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా సోమవారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు ర్యాలీలు నిర్వహించి, శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 19 : జిల్లా కేంద్రంలోని శెట్టికాంప్లెక్స్ కూడలిలోని శివాజీ విగ్రహానికి సోమవారం హనుమాన్ కరాటే అ సోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఫౌండర్ వెంకటేశ్, నాయకులు నరేందర్, కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
దామరగిద్ద, ఫిబ్రవరి 19: మండల కేంద్రం లో శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు స్వామి వివేకానంద కూడలిలో మాజీ సర్పంచ్ వన్నడి ఆశమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన హిందూ సమాజానికి, దేశానికి చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 19 : మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని గోపన్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసి న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆవిష్కరించారు. అదేవిధంగా మం డల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్, శివాజీ సేన ఆధ్వర్యంలో పట్టణంలో బై క్ ర్యాలీ నిర్వహించి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్ర భుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు కొండ గోవర్ధన్రెడ్డి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు డోకూర్ పవన్కుమార్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, భాస్కర్రెడ్డి, రాందేవ్రెడ్డి, బుచ్చన్న, కుమ్మరి బాబు పాల్గొన్నారు.
గండీడ్, ఫిబ్రవరి19: మండల వ్యాప్తంగా శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గండీడ్, వెన్నాచేడ్, సల్కర్పేట్, పగిడ్యాల్, పెద్దవార్వల్, చిన్నవార్వల్, రుసుంపలి, కొంరెడ్డిపల్లి గ్రామాల్లో శివాజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కొంరెడ్డిపల్లిలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి పా ల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు.
బాలానగర్, ఫిబ్రవరి 19 : మండలంలోని మోతిఘణపూర్లో సోమవారం ఛత్రపతి శివా జీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. శివా జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి19: జడ్చర్లలోని పలుచోట్ల శివాజీ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బాదేపల్లి పాతబజార్లోని ఆంజనేయస్వామి ఆలయం సమీపం లో శివాజీ సేవా సంఘం ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం సాయంత్రం శివాజీ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. వీరశివాజీనగర్ కా లనీలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలోనూ శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రహీం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మీనాజ్ పాల్గొన్నారు.
రాజాపూర్, ఫిబ్రవరి 19 : యువతరం శి వాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ సుశీ ల అన్నారు. సోమవారం ఆమె మండల కేం ద్రంలో ఆరెకటికే సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అరె కటికే సంఘం అధ్యక్షుడు కిషన్జీ, మాజీ సర్పంచ్ బచ్చిరెడ్డి, నరహరి, గోవర్ధన్రెడ్డి, రమేశ్నాయ క్, విక్రమ్రెడ్డి, రాజేశ్, సత్యయ్య, యాదగిరి, నర్సింహులు పాల్గొన్నారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 19: మండల కేంద్రంలో యువకులు సోమవారం శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రశాంత్, వెం కటేశ్, సాయి, కృష్ణయాదవ్, పవన్, శ్రీకాంత్, అరవింద్, శివుడు పాల్గొన్నారు.
నవాబ్పేట, ఫిబ్రవరి 19 : మండల కేం ద్రంతోపాటు కారుకొండ, రుద్రా రం తదితర గ్రామాల్లో సోమవారం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కారుకొండలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నవాబ్పేటలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఛత్రపతికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సభ్యులు రమేశ్, కృష్ణగౌడ్ ఉన్నారు.
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 19 : పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వీహెచ్పీ, భజరంగ్దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహరాజ్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు తరుణ్, రఘువీర్యాదవ్ పాల్గొన్నారు.
నర్వ/కృష్ణ, ఫిబ్రవరి19: ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు ఛత్రపతి శివాజీ అని నర్వ ఎస్సై కురుమయ్య అన్నారు. సోమవారం నర్వ మండలం రాయికోడ్లో అంబేదర్ యువజ న సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకలకు ఆయన హాజరై మాట్లాడా రు. అదేవిధంగా కృష్ణ మండలంలోని హిందుపూర్, గుడెబల్లూర్, ముడుమాల, కున్సి తదితర గ్రామాల్లో యూత్ ఆధ్వర్యంలో సోమవా రం శివాజీ జయంతిని నిర్వహించారు.