జడ్చర్ల, మే 8 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో హమాలీల సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు, మూడ్రోజులుగా వ్యాపారులు కొనుగోలు చేసిన వివిధ రకాల పంటల ఉత్పత్తులను హమాలీల కొరత కారణంగా ఎత్తలేదు. దీంతో మా ర్కెట్ షెడ్లు, ఆరుబయట తూకం వేసిన బస్తాలతో నిండిపోయింది. దీంతో రైతులు తీసుకొచ్చిన సరుకులను పోయడానికి స్థలం లేకపోవడం, బస్తాలు ఎత్తేవరకు టెండర్లు వేయడం లేదని వ్యాపారులు మా ర్కెట్ అధికారులకు లెటర్ద్వారా తెలియజేయడంతో మార్కెట్లో రెండురోజులపాటు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
దీంతో శుక్ర, శనివారం రెండు రోజులతో పాటు ఆదివారం సెలవు ఉండటంతో మూడురోజులపాటు బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి తిరిగి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై మార్కెట్ కార్యదర్శి అశ్వక్ను వివరణ కోరగా.. హమాలీ కొరత కారణంగా మార్కెట్లో ఆవరణలో ఉన్న బస్తాలను ఎత్తలేదని దాంతో ఇప్పటికే 30 వేల బస్తాలకుపైగా ఉన్నాయి.. అందుకే వా టిని ఎత్తేవరకు సెలవు ఇవ్వాలని వ్యాపారులు కోరడంతో రెండ్రోజులు మార్కెట్లో క్రయవిక్రయా లు నిలిపివేసినట్లు తెలిపారు. హమాలీలు బయటి రా ష్ట్రాల వారు ఉండటంతో వార్డు తమతమ ప్రాంతాలకు వెళ్లారని.. కొందరు హమాలీలు రైల్వే వ్యాగన్లు రెగ్యులర్గా వస్తుండటంతో అక్కడికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. సోమవారం నుంచి హమాలీలు వచ్చేలా వారితో మాట్లాడుతున్నట్లు, మార్కెట్ను యథావిధిగా కొనసాగించనున్నట్లు కార్యదర్శి తెలిపారు.