తాడూరు, నవంబర్ 23 : గ్రామాల్లోని ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని చర్లఇటిక్యాల గ్రామంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పింఛన్లు, ఇండ్లు, సీసీరోడ్లు, మురుగు కాలువల సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ వైర్లు ఇండ్లను ఆనుకొని ఉన్నాయని, కొన్ని ఇండ్ల ముందు స్తంభాలు ప్రమాదకరంగా మారాయన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు, ఇండ్లు అందజేస్తామని, అలాగే సీసీరోడ్లు, పనులను మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, సర్పంచ్ శ్రీదేవి బాలరాజు, క్లస్టర్ ఇన్చార్జి సమద్పాషా, ఎంపీపీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ శివలీల, తాసిల్దార్ కార్తీక్కుమార్, ఎంపీడీవో గంగమోహన్, ఎస్సై శ్రీనివాసులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యార రమేశ్, నాయకులు తిరుపతిరెడ్డి, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.