వనపర్తి టౌన్, జనవరి 22 : ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో వనపర్తికి చెందిన విద్యార్థినులు నాలుగు స్వర్ణ పతకాలను సాధించినట్లు గుజారియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఖేలో కిక్ బా క్సింగ్ ఉమెన్స్ లీగ్ నిర్వహించగా.. 37 కేజీల విభాగంలో అనన్య, 42 కేజీల విభాగంలో ఝాన్సీ, 46 కేజీల విభాగంలో రేణుక, 55 కేజీల విభాగంలో కీర్తనలు స్వర్ణ పతకాలు సాధించారన్నారు.
వీరికి ఐఏఎస్ అధికారులు లక్ష్మి, అనిత, ఖేలో ఇండియా కన్వీనర్ జగదీశ్యాదవ్ బహుమతులు అందజేశా రు. కాగా, విద్యార్థినులను అకాడమీ నిర్వాహకులు సోమవారం అభినందించారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్, ఉపాధ్యక్షులు శేఖ ర్, సీనియర్ విద్యార్థులు శివకృష్ణయాదవ్, వరుణ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.