మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 6: తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. టుటౌన్ సీఐ ప్రవీణ్కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో జగ్జీవన్రాం నగర్కు చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి కృష్ణయ్య కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఓ శుభాకార్యంలో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళంవేసి వెళ్లా రు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి దుండగులు ఇంటితాళం విరగ్గొట్టి బీరువా లాకర్లో ఉన్న 3తులాల బంగారు పుస్తెలతాడు, 8 బంగారు గాజులు, ఉంగరాలు, చేతి ఉంగరాలు, కమ్మలు, 6 తులాల బంగా రు గొలుసులతోపాటు వివిధ రకాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.70వేల నగదు, స్కూటీతో పరారయ్యారు.
కుటుంబసభ్యులు మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి త లుపులు తెరిచి ఉండడంతోపాటు బీరువా తాళం విరగ్గొట్టి ఉండడంతో టుటౌ న్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్లి పరిసరా లు పరిశీలించి బాధితులతో వివరాలు సేకరించారు. క్లూస్ టీంతో ఫింగర్ప్రింట్స్ ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.