సరస్వతీదేవీని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట విశేషంగా ఆరాధిస్తారు. సర్వవిద్యలకు ఆధారం వాగ్దేవి దేవి చిన్నా పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, బలపాలు, పెన్నులు అమ్మవారి వద్ద పెట్టి అమ్మను కొలుస్తారు. అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సంగీత సాహిత్యాలకు సరస్వతీదేవీనే మూలం.
త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేశాక చరాచర జీవరాశి సమస్తం యావత్తు నిశ్శబ్దంగా ఉంది. ఆయా జీవ జాతులకు సంబంధించిన సహజమైన శబ్ధాలున్నప్పటికీ భాషాప్రయుక్త, భావ ప్రకటన శబ్ధం మాత్రం లేదు. శబ్ధానికి అర్థం ఉండాలన్న బ్రహ్మ తలంపు మేరకు తన ఊహల్లో మెదిలిన సరస్వతీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. తన కమండలంలోని మంత్రజలాన్ని ప్రకృతిపై చల్లుతాడు. దీంతో వీణాధారి సరస్వతీదేవి జన్మిస్తుంది. వీణానాదంతో చెట్లకు చిగురు తొడిగి ప్రకృతికి కొత్త సొగబులు అద్దుకుంటుంది. ఈ విషయాన్ని సూచిస్తూ వసంత పంచమి వేడుకలు నిర్వహించుకుంటారు. వసంత పంచమి నాడు అమ్మ జన్మించినందుకు గానూ శ్రీ పంచమిగా జరుపుకొంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
సరస్వతీదేవి చేతిలో ఉన్న చిలుక గురువు చెప్పిన దానిని రెండు సార్లు మననం చేస్తూ ఉండమని సూచిస్తుందని, అక్షరమాల గ్రహించిన విషయాలను పలుమార్లు స్మరించుకోవాలని సూచిస్తుందని, గ్రంథం- విన్నదానికంటే మరికొంత సచారాన్ని గ్రంథాల ద్వారా తెలుసుకోవాని సూచిస్తుందని, అలాగే అమ్మవారి చేతిలోని వీణ నిరంతరం వాద్యధ్వనిని చేస్తూ ఉన్నట్లయితే ఆ సంగీతం విన్న వ్యక్తికి కరతాలామలకం అవుతుందని పండితులు అమ్మవారి విశిష్టతను వివరిస్తున్నారు.
గద్వాలటౌన్, ఫిబ్రవరి 13 : గీర్వాణిగా.. వాగ్దేవీ గా… వి ధివల్లభగా.. బ్రాహ్మణిగా.. వాక్కుకు, బుద్ధికి విజ్ఞానానికి, వివేకానికి కళలకు అధినేత్రి.. అక్షరాలకు ఆదిదేవతా.. సకలవిద్యలరాణి జ్ఞానప్రదాయిని.. కళల కాణాచి, విజ్ఞాన వీక్షి సరస్వతీగా.. భారతీగా అమ్మ సాధించిన కీర్తి అనితర సా ధ్యం.. అమ్మ మహిమాన్వితాన్ని.. విశిష్టతను రుగ్వేదం, బ్ర హ్మ వైవర్త పురాణం, దేవీ భాగవతం, పద్మాపురాణాలు వే నోళ్ల పొగిడాయి.. కీర్తించాయి.. అందుకే సరస్వతీదేవీని ద ర్శించుకున్నంతనే సకల విద్యలు సిద్ధిస్తాయన్నది హిందువుల నమ్మకం.. అం తటి మహిమానిత్వం గల సరస్వతీదేవి పు ట్టిన రోజు మాఘశద్ధ పంచమి.. ఈ పంచమినే శ్రీపంచమిగా జరుపుకోవడం ఆనవాయితీ. అందుకు గానూ జిల్లాలోని సరస్వతీ ఆలయాలు, పీఠాలు ముస్తాబయ్యాయి. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొనే శుభదినాల్లో వసంత పంచ మి ఒకటి. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా అంటా రు. ఎందుకంటే వసంత పంచమినాడే శారదాంబ జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. వసంత పంచమిని యా వత్తు భారతదేశం విశేషంగా జరుపుకొంటుంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానది తీరాన జా తీయ రహదారి పక్కన ఉన్న బీచుపల్లి క్షేత్రంలో ఉన్న సరస్వతీ ఆలయంలో అక్షర శ్రీకారం చుట్టడానికి జిల్లా నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు రానున్నారు. అదిలాబాద్ జిల్లాలోని బాసర తర్వాత గద్వాల జిల్లాలోనే సరస్వతీ ఆలయం ఉండడం, జాతీయ రహదారి పక్కన ఆలయం ఉండడంతో బీచుపల్లికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. బాసరకు వెళ్లలేని వారు ఎంతో మంది బీచుపల్లిలోని సరస్వతీ ఆలయంలోనే తమ పిల్లల అక్షరాభ్యాసానికి శ్రీకారం చుడుతున్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని బీచుపల్లిలోని శ్రీహయగ్రీవ సరస్వతీ ఆలయంతోపాటు జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ పంచమి వేడుకలు జరుపుకునేందుకు అన్ని హంగుల్లో ముస్తాబవుతున్నాయి. అమ్మవా రు పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు అ నేక మంది భక్తులు ఆలయాలకు, మందిరాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా ఆయా ఆలయాల అర్చకులు, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సరస్వతీ పీఠాలు, పాఠశాలల్లో శ్రీపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.