పాలమూరు, సెప్టెంబర్ 27 : మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో బుధవారం వినాయ క నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధు లు వినాయక విగ్రహాలు, భక్తుల తో కోలాహలంగా మారింది. పో లీసుల భారీ బందోబస్తు మధ్య నిమజ్జనానికి విగ్రహాలను తరలించారు.
లడ్డూ వేలంపాటలో ఉత్సహంగా యువకులు, పెద్దలు పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువకులు జై బో లో గణేశ్ మహరాజ్కీ జై అంటూ నినాదాలు చేశారు. డీజేలు, బ్యాండ్ మేళాల మధ్య నృ త్యాలు, అడుగుల భజనలు నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తు లు పాల్గొన్నారు.