జోగులాంబ గద్వాల : జోగులాంబ డ రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కవిత, ప్రకాష్ దంపతుల రెండో కుమార్తె శ్రావ్య (8) ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో గమనించిన తండ్రి, అప్పటికే శ్రావ్య వేలు పాము నోట్లో ఉండటాన్ని గుర్తించి చేతులతో పామును పట్టుకుని వేలును బయటకు తీశారు.
అనంతరం పామును చంపినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శ్రావ్య మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.