మహబూబ్నగర్, ఫిబ్రవరి 7 : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల వద్దకే కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమార్గం చూపాలని సూచించారు. ప్రజావాణికి 67 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థినులకు సన్మానం
రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో గాంధీ మెడికల్ కళాశాల, మహబూబ్నగర్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన గోపిక, హరితను కలెక్టర్ వెంకట్రావు సన్మానించి అభినందించారు. రెడ్క్రాస్ విద్యానిధితో విద్యార్థినుల ఉన్న త విద్యకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీవో పద్మశ్రీ, డీఆర్డీవో యాదయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈవో మొగులయ్య, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ పాల్గొన్నారు.