ఖిల్లాఘణపురం, మార్చి 3 : 13వ శతాబ్దంలో కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి నిర్మించిన గణపసముద్రాన్ని రిజర్వాయర్గా మార్చేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 77 విడుదల చేసి రూ.47.73 కోట్లు కేటాయించింది. దీంతో టీఆర్ఎస్ నాయకు లు, రైతులు మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్ మాట్లాడుతూ గణపసముద్రం వందేండ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే అలుగుపారిందన్నారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్ కింద గణపసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారనున్నదన్నారు. సమైక్య రాష్ట్రంలో ఒట్టిపోయిన ఈ చెరువును మిషన్కాకతీయ కింద మరమ్మతులు చేసి రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. 2018 మే 6న సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో ఘణపురం బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని తరలించడంతో అలుగుపారిందన్నారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి నిరంజన్రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సర్పంచ్ వెంకటరమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ రాజు, నాయకులు బాల్రెడ్డి, మన్నెంగౌడ్, ఆంజనేయులుగౌడ్, గోపాల్, బాలరా జు, రాంచంద్రయ్య, శ్రీనివాసులు, శేషయ్య, మన్నెం, రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.