వనపర్తి, ఫిబ్రవరి 17: రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా పట్టణ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్ద 100 మొక్కలు నాటి, అనంతరం ఎమ్మెల్యే నివాసగృహం ఆవరణలో సర్వమత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అ ధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శులు రమేశ్, పరంజ్యోతి, కౌ న్సిలర్లు నాగన్నయాదవ్, మహేశ్, కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, నారాయణ, కృష్ణ, రవి, పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు గిరి, సోషల్ మీడియా ఇన్చార్జి సునీల్, పట్టణ అధ్యక్షురాలు నాగమ్మ, నాయకురాలు లక్ష్మి, శైలజ, నాయకులు శరవంద, డానియల్, శ్యామ్, యు గంధర్, రాము, సునీల్, సుభాష్, ప్రశాంత్, శివ పాల్గొన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటం వద్ద టీఆర్ఎస్ నాయకులు కేక్కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చే శారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి, వైస్ఎంపీ పీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, సింగిల్విండో చైర్మన్ రాములు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తి రుపతియాదవ్, గ్రామ అధ్యక్షుడు మణ్యంనాయక్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు కోదండం, ప్రధాన కార్యదర్శి శేఖర్, గ్రామ అధ్యక్షు డు రాజేశ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు మతీన్, నాయకులు పాల్గొన్నారు.
ఆయా గ్రామాల్లో కేక్ కటింగ్..
మండలంలోని రాజపేట, పెద్దగూడెం, అంకూర్, చిమనగుంటపల్లి గ్రామా ల్లో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ నాయకులు గురువారం కేకులు కట్ చే శారు. చిట్యాల శివారులోని అనాథశ్రమంలో వనపర్తి వ్యవసాయ సహకారసంఘం చైర్మన్ వెంకట్రావు, చిట్యాల సర్పంచ్ భానుప్రకాశ్రావు ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాధవ్రెడ్డి, ఉపసర్పంచ్ సేవ్యానాయక్, రాఘవేంద్రరెడ్డి, ఎల్లయ్య, శంకరయ్య, వినోద్, రాజవర్ధన్రెడ్డి, శ్రీను, రాములు, వెంకటయ్య, రాంచంద్రయ్య, కరుణాకర్, రాములు, చిన్న కోటయ్య, చంద్రయ్య, రాజు, సుధాకర్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, అమరచింత ఎత్తిపోతల సంఘం అధ్యక్షుడు హెచ్బీ రాజేందర్సింగ్ అమరచింత ప్రభుత్వ పాఠశాలలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం రాజేందర్సింగ్ నివాసంలో కేక్కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగభూషణంగౌడ్, టీఆర్ఎస్వీ ఉమ్మడిజిల్లా మాజీ అధ్యక్షుడు నరేశ్రెడ్డి, మండల అధ్యక్షుడు రమేశ్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, ప్రచార కార్యదర్శి రఫీ, కౌన్సిలర్లు రాజ్కుమార్, లక్ష్మి, రాజశేఖర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రాజేందర్, షానవాజ్ఖాన్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థికసాయం
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్వీ ఉమ్మడిజిల్లాల మాజీ అధ్యక్షుడు నరేశ్రెడ్డి ఎంబీబీఎస్ విద్యార్థిని అర్చనకు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, అమరచింత ఎత్తిపొతలసంఘం అధ్యక్షుడు రాజేందర్సింగ్తో కలిసి ఎంబీబీఎస్ సీటు సాధించిన అర్చన ఇంటికి వెళ్లి ఏడాదిపాటు పుస్తకాలకు అయ్యే ఖర్చును వారి కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చైర్మన్ రాజు, మాజీ వైస్చైర్మన్ నాగభూషణంగౌడ్, కౌన్సిలర్ రాజ్కుమార్, కోఆప్షన్ సభ్యులు రాజేందర్, షానవాజ్ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, నాయకులు ఉన్నారు.
నోట్పుస్తకాలు పంపిణీ
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని గ్రంథాలయం వద్ద కేక్కట్ చేశారు. అనంతరం జెడ్పీ, కస్తుర్బా పాఠశాల విద్యార్థులకు నోట్పుస్తకా లు పంపిణీ చేశారు. వెల్టూర్లో స ర్పంచ్ శ్రీనివాస్రెడ్డి పాఠశాల, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు.