జోగులాంబ గద్వాల : రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎరువులు, విత్తన దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న ప్రతి ఎరువు బస్తాకు దుకాణదారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.
కల్తీ ఎరువులు, విత్తనాలు రైతులకు అమ్మితే లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదన్నారు. రైతులు కూడా ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు రశీదులు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.