అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా చేరుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,086 క్యూసెక్కు లు ఉండగా, అవుట్ఫ్లో 10,751 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.739 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1632.71 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్లు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా కొనసాగుతోంది. శనివారం ఆనకట్టకు క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 5,455 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 5 వేల క్యూసెక్కుల వరద చేరు తోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీ ఎస్ ఆనకట్టలో 8.7 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 455 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.