జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా పట్టాదారు పాస్ బుక్ కోసం రైతు శ్రీరాములు నుంచి పది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. పది వేలు ఇవ్వలేనని 7,500 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు.
అనంతరం శ్రీరాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు 7,500 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.