శ్రీశైలం, అక్టోబర్ 20 : కృష్ణానది పరీవాహక ప్రాం తాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గురువారం జూరాల గేట్ల నుంచి 98,544, విద్యుదుత్పత్తి నుంచి 36,673, సుంకేసుల నుంచి 47,047 క్యూసెక్కులు విడుదల కాగా.. శ్రీశైలం జలాశయానికి సాయంత్రం 1,20,785 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213.88 టీఎంసీలు ఉన్నది. ప్రాజెక్టు ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి 27,937, కుడిగట్టు విద్యుదుత్పత్తి నుంచి 31,062, ఎడమగట్టు విద్యుదుత్పత్తి నుంచి 35,315 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేశారు. ఏపీ పవర్హౌజ్లో 15.20 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా.. టీఎస్ పవర్హౌజ్లో 17.15 మి.యూ ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
అమరచింత, అక్టోబర్ 20 : జూరాల ప్రాజెక్టుకు వరద రోజురోజుకూ తగ్గుతున్నది. గురువారం సాయంత్రం 1.13 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బీమా లిఫ్ట్-2కు 750, విద్యుదుత్పత్తి కోసం 32,673, ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 730 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 1,32,901 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అయిజ, అక్టోబర్ 20 : కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు వరద స్వల్పంగా పెరిగింది. గురువారం ఇన్ఫ్లో 34,724, అవుట్ఫ్లో 34,355 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 105.788 టీఎంసీలు నిల్వ ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 48,370 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 47,900 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. ప్రధాన కాల్వకు 470 క్యూసెక్కులు విడుదల కాగా, ఆనకట్టలో 11 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 20 : కోయిల్సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో రెండు గేట్లను ఎత్తి 1500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతున్నది. నారాయణపేట, కొడంగల్, మద్దూర్ మండలాలకు తాగునీటి అవసరాలకు 10 క్యూసెక్కులు వదులుతున్నారు.