అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు
నిజమని నిరూపిస్తే నా పదవులకు రాజీనామా చేస్తా
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్
వనపర్తి, ఫిబ్రవరి 6: అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సా గుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిపై ఓ స్థలం విషయంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. అసత్య ప్రచారాలు మాని.. ఆధారాలతో ముందుకు రావాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ స వాలు విసిరారు. జిల్లాకేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరు ల సమావేశం ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ 20 ఏండ్లు పదవులను అనుభవించి అభివృద్ధి చేయని, సోయిలేని నాయకులు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నిరంజన్రెడ్డిని చూసి తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నా రు. ఆరోపణలు మాని ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎదురుగా ఢీకొనే ధైర్యం లేక సోషల్మీడియాలో ఇష్టానుసారం ప్రచారం చే స్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం టీఆర్ఎ స్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని 1119, 1120 సర్వే నెంబర్లోని స్థల వివాదం కొన్నేండ్లుగా నడుస్తుందన్నారు. 1984లో రాజారామేశ్వరావు ఆ భూమిని ఇనామ్ రైతుల నుంచి కొనుగోలు చేయ గా 1984,1985లో వనపర్తి గ్రామ పంచాయతీ లేఅవుట్ అప్రూవల్ చేశారన్నా రు. 1986లో పీపుల్స్ వార్ దళ కమాండర్ ప్రభాకర్రెడ్డి ఆ స్థలం పేదలకు చెందినదని.. రాజారామేశ్వరరావు ఆక్రమించగా ఎర్రజెండాలు పాతి పేదలకు గుడిసెలు వేయించార ని పేర్కొన్నారు.
ఈ వి షయమై 1990లో ఏ ర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో రాజారామేశ్వరావు మాట్లాడుతూ.. తా ను ఆ స్థలాన్ని ఆక్రమించలేదని.. అది దేవాదాయ శాఖకు చెందినదని చెప్పారన్నారు. ఇనామ్ రైతులకు ఇచ్చిన భూ మిని మళ్లీ కొనుగోలు చేయరాదని కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గట్టుయాదవ్ గుర్తు చేశారు. ఇనామ్ రైతుల వారసులైన అజయ్ రాజారామేశ్వరావుపై అప్పీలుకు వెళ్లగా, అ ప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు రావుల చంద్రశేఖర్రెడ్డి కో ర్టులో కేసు వేశారన్నారు. ఇనామ్ రైతు (నర్సింగరావు) కు టుంబసభ్యులు భగవంతురావు వారసులమని నిరూపించుకొని కేసు గెలిచినట్లు వివరించారు. ఈ విషయాలన్నీ కోర్టులో కేసులు వేయించిన మీ నాయకుడికి తెలియదా అని ప్రశ్నించారు. అసత్య ప్రచారాలను చేసిన టీడీపీ నా యకులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని.. ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. సమావేశంలో గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవి, కౌన్సిలర్ నాగన్నయాదవ్, నాయకులు శ్రీనివాస్సాగర్, అజీజ్ఖాన్, మహేశ్యాదవ్ తదితరులున్నారు.