మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 21 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వే స్తున్నదని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం హెచ్బీ, నేషనల్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరఫున దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పం డుగలకూ సమప్రాధాన్యత కల్పిస్తున్నదన్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాకు చెందిన మైనార్టీ నాయకులకు కా ర్పొరేషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. గత పాలకులు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారన్నారు. మైనార్టీల శ్మశానవాటికకు స్థలం కేటాయించామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా 200 కు పైగా మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
రోడ్డు విస్తరణతోపాటు జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మినీట్యాంక్బండ్ వద్ద సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించామన్నారు. మహబూబ్నగర్ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ గతానికి.. ఇప్పటికీ ఉన్న మహబూబ్నగర్కు తేడాగమనించాలన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. హఫీజ్ ఫైజొద్దీన్ ప్రత్యేక దువా చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన అబ్దుల్హ్రెమాన్ను సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఫై నాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ఇసాక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, నాయకులు రహెమాన్, అన్వర్పా షా, మక్సూద్హుస్సేన్, సమాద్ఖాన్, మహ్మద్ఇక్బాల్, వాహెద్తాజ్, మహ్మద్ అన్వ ర్, మోసిన్ఖాన్, మహమూద్ అలీ, అర్షద్అలీ, జావిద్బేగ్, సుల్తాన్ పాల్గొన్నారు.