జాతీయ లోక్ అదాలత్తో సత్వర న్యాయం
మహబూబ్నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి
మహబూబ్నగర్ మెటుగడ్డ, మార్చి 12 : జాతీయ లోక్ అదాలత్తో సత్వర న్యాయం జ రుగుతుందని మహబూబ్నగర్ జిల్లా కోర్టు ప్ర ధాన న్యాయమూర్తి ప్రేమావతి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జా తీయ లోక్ అదాలత్ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 11,818 కేసులు రాజీమార్గాన పరిష్కరించామన్నారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకొ ని సమయాన్ని, డబ్బులను ఆదా చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే కేసులకు కో ర్టు ఫీజు వాపస్ ఇస్తారన్నా రు. కార్యక్రమంలో మొదటి అదనపు జడ్జి రఘురాం, రెండో అడిషనల్ జిల్లా జడ్జి అన్ని రోజ్ క్రిస్టియానా, ఫ్యామిలీ కోర్టు జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రాం, జిల్లా న్యాయసేవాధికార సం స్థ కార్యదర్శి సంధ్యారాణి, న్యాయమూర్తులు శ్రీదేవి, పీబీ కిరణ్, శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు, ప్రభుత్వ న్యాయవాది మనోహర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్దన్, శ్రీనివాస్రావు పాల్గొన్నారు.