నారాయణపేట టౌన్, అక్టోబర్ 1 : వయోవృద్ధులను సంరక్షించుకునే బాధ్యత వారి సంతానానిదేనని కలెక్టర్ హ రిచందన అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సం దర్భంగా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నిరాధారణకు గురైన వయోవృద్ధులు హెల్ప్లైన్ నెంబర్ 145 67కు కాల్ చేసి తమ సమస్యలు తెలియపర్చాలన్నారు. అ నాథలైన వయోవృద్ధుల కోసం పట్టణంలో ఆశ్రమం ఏర్పా టు చేశామన్నారు. వయోవృద్ధులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని, వారిని వేధింపులకు గురిచేస్తే తల్లిదండ్రు లు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం కఠిన శిక్షలు పడతాయన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్రావు మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా క్షేత్రస్థాయి అధికారిని నియమించామని, ఆ అధికారి నేరు గా ఇంటి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటారన్నారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు ఆటపోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటమ్మ, వయోవృద్ధులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
ఏఈవోలు, ఎంపీఎస్వో లు పంటలకు సంబంధించి పంటకోత ప్రయోగాలను పకడ్బందీగా నిర్వహించి దిగుబడులు నమోదు చేయాలని కలెక్టర్ హరిచందన సూచించా రు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశపు మందిరంలో పంటకోత ప్రయోగాలపై శనివారం ఎంఏవో, ఏఈ వో, ఎంపీఎస్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పంట వివరాలను ఆర్ఎస్ఎస్ పోర్టల్లో తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. సీపీవో గోవిందరాజన్ ఏఈవోలు, ఎంపీఎస్వో లు తమకు కేటాయించిన గ్రామాల్లో పంటకోత ప్రయోగా లు చేసే విధానంపై పవర్పాయింట్తో వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్, ఎంఏవోలు, ఏఈవోలు, హార్టికల్చర్ అధికారులు, ఎంపీఎస్వోలు తదితరులు పాల్గొన్నారు.