న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: హిందుస్థాన్ యునిలీవర్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 1.53 శాతం తగ్గి రూ.2,561 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.2,601 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం కూడా రూ.15,375 కోట్ల నుంచి రూ.15,441 కోట్లకు ఎగబాకింది. మరోవైపు, రూపాయి విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.24 తుది డివిడెండ్ను ప్రకటించింది.