నారాయణపేట, సెప్టెంబర్ 30 : పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం వీసీ నుంచి పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హెచ్ఆర్ఎంఎస్లో లీవ్స్, వర్టికల్స్ పనితీ రు, నేరాల వివరాల ఆన్లైన్ నమోదు, పెండింగ్లో ఉన్న కేసులపై అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోర్టు అధికారులను స మన్వయం చేస్తూ పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ సిబ్బంది బయోడేటా మొత్తం ఆన్లైన్లో నమోదు చేశామని, స్టేషన్ల వారీగా నెలవారి తనిఖీ లు నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నామని, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు తదితర అం శాలపై షీ టీమ్స్, కళా బృందంతో ప్రజల కు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
గస్తీని పెంచాలి
పండుగల సందర్భంగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని, సమయంలో దొంగతనాలు నివారణకు పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు. శుక్రవారం ఎస్పీ కా ర్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారి సమీక్షా స మావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు శాంతియుతంగా జరుపుకొనేలా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పా త నేరస్తులపై నిఘా ఉంచాలని, డంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని, ఈ చలాన్, ఈ పెట్టి కేసులు ఎక్కువ గా నమోదు చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కె మెరాలు పెట్టుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. సమావేశంలో డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సీఐలు సీతయ్య, రాంలాల్, జనార్దన్, ఆర్ఐ కృష్ణ య్య, ఎస్సైలు శివనాగేశ్వర్ నాయుడు, నవీన్, వసంత, సు ధామాధురి, సునీత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.