గద్వాల న్యూటౌన్, మార్చి 26 : నవమాసాలు మోసి.. కని.. అల్లారు ముద్దు గా పెంచిన కన్నతల్లిని సెల్ఫోన్ కొనివ్వలేదని రోకలి బండతో కొట్టి చంపిన తనయుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఘటనకు సం బంధించిన వివరాలను ఎస్పీ రంజన్త్రన్కుమార్ వెల్లడించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం షేర్పల్లికి చెందిన వరలక్ష్మి (52)కి ఇద్దరు కొ డుకులు. పెద్ద కొడుకు మహేశ్ ఇంటర్ వరకు చదివి మధ్యలోనే ఆపేశాడు. అత డు తరచూ సెల్ఫోన్ కొనివ్వాలని, ఖ ర్చులకు డబ్బులు ఇవ్వాలని తల్లిని వే దించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తల్లితో ఫోన్ ఇప్పించాలనే వి షయమై గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆగ్రహంతో రోకలిబండతో తల్లిని కొట్లాడు. దీంతో వరలక్ష్మి మృతి చెందింది. మృతిరాలి అక్క కాశపోగు దేవమ్మ ఫిర్యాదు మేరకు ఉం డవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఉండవల్లి మండ లం ప్రాగటూరు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విచారించగా నేరాన్ని ఒ ప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి రోకలిబండ, సెల్ఫో న్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసు ఛేదించేందుకు సహకరించిన అలంపూర్ ఇన్చార్జి సీఐ షేక్ మహబూబ్ బాషా, ఉండవెల్లి ఎస్సై జగన్మోహన్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ షేక్ మహబూబ్బాషా, ఎస్సై జగన్మోహన్ సిబ్బంది పాల్గొన్నారు.