ఎర్రవల్లి చౌరస్తా, మార్చి 28: పోలీస్గురి ఎప్పటికీ తప్పొద్దని ఎస్పీ రంజన్ రతన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీ-మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి మూడురోజులపాటు ఎర్రవల్లి పదోపటాలంలోని ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ శిక్షణ, ప్రాక్టీస్ చేయించారు. వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను ఎస్పీ రంజన్ రతన్కుమార్ సందర్శించి అధికారులకు ఇచ్చే శిక్షణను పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందులకు పోలీస్ అధికారలు, సిబ్బంది అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతోపాటు అన్నిరకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలన్నారు సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ శిక్షణలు ఎంతగానో ఉపయోగపడుతాయని, మూడు రోజుల నుంచి నడుస్తున్న ఫైరింగ్ శిక్షణ సోమవారంతో ముగిసిందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియెల్, సీసీ సీఐఎస్ చంద్రశేకర్, వెంకటేశ్వర్లు, శివకుమార్, నాగేశ్, సీఐ బాషా, ఎస్సై గోకారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.