అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,477 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 11,073 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.740 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1632.97 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతోంది. ఆదివారం 10,743 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 10,350 క్యూసెక్కుల వరద నీరు ఆన కట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి వరద చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.1 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 493 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.