జోగులాంబ గద్వాల : గ్రామాలలో నిర్వహించే వి.సి.పి.సి (విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) సమావేశాలలో స్పెషల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఎం.ఈ.ఓ లు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్లో జిల్లా అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో అధికారులు (VCPC) సమావేశాలు నిర్వహించాలన్నారు.
బాలల సమస్యలపై చర్చించి, సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని అన్నారు. డ్రాప్ అవుట్ అయిన పిల్లలను తిరిగి పాఠశాలలకు పంపించేలా వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని, స్కూల్స్ లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తల్లితండ్రులు పిల్లలకు ఇతర పనులు చెప్పకుండా చదువు పైనే దృష్తి పెట్టేలా వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళల పై లైంగిక వేధింపులు నిరోధించడానికి, వారికి అనుకులామైన పని ప్రదేశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళల పై లైంగిక వేధింపులు నిరోధక చట్టం 2013 తీసుకొచ్చిందన్నారు.
ఈ చట్టం ప్రకారం సంఘటిత, అసంఘటిత రంగాలు పని చేసే చోట 10 అంతకంటే ఎక్కువ మంది వర్కర్స్ పని చేస్తున్నట్లయితే అక్కడ మహిళల పై లైంగిక వేధింపులు నిరోధించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలనీ, కార్యాలయంలోని ప్రతి అధికారి రాతపూర్వక ఉత్తర్వ్యుల ద్వారా అంతర్గత ఫిర్యాదుల కమిటీ గా పిలవబడే కమిటీ ని ఏర్పాటు చేయాలన్నారు.
పని చేసే చోట సిబ్బందికి అధికారి చట్టం పై అవగాహన కల్పించాలని అన్నారు.
అనంతరం ప్రజావాణి లో జిల్లాలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, జిల్లా అధికారులు , తదితరులు పాల్గొనారు.