మూసాపేట, సెప్టెంబర్ 28 : దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆల వెంకటేశ్వర్రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవ ర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నారు. పార్టీలకతీతంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ సం క్షేమ పథకాలను సైతం అర్హత ఉన్న వారందరికీ అందజేస్తున్నా రు. దీంతో సొంత పార్టీతోపాటు ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అఖండ శక్తిగా ఎదిగింది. ప్రస్తుతం ప్రతిపక్షాలతో పోలిస్తే టీఆర్ఎస్ ఓ సముద్రంలా కనిపిస్తున్నది. ఈ క్రమంలో టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బతీయాలని ప్రతిపక్షాల నాయకులు, నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే వారు, ఇతర పార్టీల్లో ఉండే నాయకులు, కొత్తగా ఎమ్మె ల్యే టికెట్ ఆశిస్తున్న వారికి ఉమ్మడి జిల్లాలోనే దేవరక ద్ర నియోజకవర్గాన్ని టార్గెట్గా ఎంచుకున్నారు. అం దుకే పాదయాత్రలు, నిరసనలు, ర్యాలీలు, సమావేశాలకు వేదిక చేసుకుంటున్నారు. వచ్చిన నాయకులు టీఆర్ఎస్ను, ఎమ్మెల్యేను విమర్శిస్తున్నారు. కానీ వా రి పాచికలు పారడం లేదు.
ప్రజలు అలాంటి వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి గడపకూ సం క్షేమ పథకాలు అందుతుండడంతో ఎవరూ టీఆర్ఎస్ను వీడాలని ఆలోచన కూడా చేయడం లేదు. సమైక్య పాలనలో జిల్లాలోనే కృష్ణా జలాలు అత్యధికంగా పారుతున్నా.. చుక్క నీటిని కూడా వాడుకునే పరిస్థితి లేదు. దీంతో నియోజకవర్గం ఏడారిగా మారి కరువు తాండవించే దుస్థితి ఉన్నది. ప్రజలంతా ఉపాధి లేక గుంపు మేస్త్రీల వద్ద బానిసలుగా మారి వలసలు వెళ్లేవారు. స్వరాష్ట్రంతో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడడం, ఆల వెంకటేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పరిస్థితి పూర్తిగా మారింది. అభివృద్ధితోపాటు సాగునీటిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పిస్తూ.. మంత్రుల సహకారంతో ఎప్పటికప్పుడు నియోజవర్గ అభివృద్ధికి అత్యధికంగా నిధులు తీసుకొస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా సాగునీరు తీసుకొచ్చి కరువుగా ఉన్న ప్రాంతాన్ని పచ్చని పంట పొలాలతో కళకళలాడేలా చేశారు. ఇదంతా కేవలం ఎనిమిదేండ్లలోనే జరిగింది. ఈ తరుణంలో ప్రతిపక్షాల నేతలు వచ్చి లబ్ధిదారులు, రైతుల ముందే ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేక బీజేపీ, కాంగ్రెస్లను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారు. ‘మీరు చేస్తున్న అభివృద్ధి మా కండ్ల ముందే కనిపిస్తున్నది.. కానీ ప్రతిపక్ష నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం, అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చూస్తుండడంతో ఆయా పార్టీలను వీడుతున్నాం’ అని టీఆర్ఎస్లో చేరిన నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్న కొందరు చాటుగా ఎమ్మెల్యేను పొగుడుతున్నారు.
టీఆర్ఎస్లోకి భారీగా వలసలు..
అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు ఎమ్మెల్యే ఆల సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో రఘు, లింగన్న, మన్నెం, శ్రీను, కర్నె రాములు, పాషా, శివకుమార్, కార్తీక్, అఖిల్, శ్రీకాంత్, మహేశ్, నరేశ్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, సర్పంచ్ కల్పన, జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు మహమూద్, సలీం, సత్యనారాయణరెడ్డి, రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి చూసి పార్టీ మారిన..
టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరాను. గతంలో ఎడారిని తలపిస్తున్న వాగులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఊకచెట్టు వాగులో నీరు నిలవకుండా వృథా అయ్యేవి. చెక్డ్యాంలు నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషంగా రెండు పంటలు పండిస్తున్నారు. ఎమ్మెల్యే ఆల పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారు. అందుకే ఆలన్న వెంట నడిచేందుకు గులాబీ దళంలో చేరా.
– భాస్కర్రెడ్డి, దాసర్పల్లి, దేవరకద్ర
ఎమ్మెల్యే పనితీరుకు మెచ్చి..
బీజేపీలో 20 ఏండ్లుగా కార్యకర్తగా పనిచేశా. ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పనితీరు మెచ్చి బీజేపీ మండలాధ్యక్షుడి పదవికి రాజీనామీ చేసి టీఆర్ఎస్లో చేరాను. కరివెన గ్రామానికి బీజేపీ నుంచి ఉప సర్పంచ్గా ఉన్నా.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టా. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏమీ చేయడంలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు డబ్బులు పంచితే ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే ఆల పనితీరు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతో చేరువయ్యాయి. ఇది గమనించి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరా.
– బాల్రెడ్డి, కరివెన ఉపసర్పంచ్