జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని ఓ మహిళకు రెండవ కాన్పులో ముగ్గురు శిశువులు (Three babies) జన్మించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు అనంత హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని (Dr. Ashwini ) తెలిపారు. గద్వాల పట్టణం వడ్డె వీధికి చెందిన జయశ్రీ, నరేష్ దంపతులకు 2020లో వివాహం అయ్యింది. 2022లో మొదటి కాన్పులో పాప జన్మించగా రెండవ కాన్పులో ఒక పాప, ఇద్దరు మగశిశువులు జన్మించారు.
డాక్టర్ అశ్విని మాట్లాడుతూ.. తమ ఆసుపత్రిలో మొదటి సారి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారని తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరమన్నారు. కాన్పునకు సంబంధించి శస్త్ర చికిత్సలో సహకరించిన డాక్టర్ వినిషారెడ్డి, డాక్టర్ బిందు సాగర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.