త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో వెల్లడి
కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ప్రాజెక్టు మాట మరోమారు సీఎం కేసీఆర్ నోట వినపడింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు త్వరలోనే పూర్తవుతాయని ప్రకటించారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. పాలమూరు ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ స్పష్టంగా హామీ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాలమూరు ప్రజలకు సీఎం కేసీఆ ర్ శుభవార్త అందించారు. వివిధ కారణాలతో నిలి చిపోయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను త్వరలో పూర్తి చేస్తామని వివరించారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సభలో సీఎం ఈ అంశాన్ని లేవనెత్తారు. మల్లన్నసాగర్ వంటి రిజర్వాయర్లు పీఆర్ఎల్ఐ పరిధిలోనూ నిర్మిస్తున్నట్లు చెప్పారు. మల్లన్నసాగర్ను చూసి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అడిగారన్నారు. పీఆర్ఎల్ఐ పరిధిలో 70 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు దాదాపుగా పూర్తి కావచ్చాయని సీఎం తెలిపారు. టన్నెల్ పనులు పూర్తయ్యాయన్నారు. సీఎం మాటలకు కృతజ్ఞతగా మంత్రి శ్రీనివాస్గౌడ్ వేదికపై నిలబడి అభివాదం చేశారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టును త్వర గా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుం టే.. ప్రతిపక్షాలు ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉం డగా, కొల్లాపూర్ పరిధిలోని ఎల్లూరు శివారులో పీఆర్ఎల్ఐ ప్యాకేజీ 1,2,3, కోడేరు మండలం తీగలపల్లి సమీపంలోని ఏదుల రిజర్వాయర్ పంప్హౌజ్లో నిలిచిపోయిన పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన అధికార బృందం పరిశీలించింది. గతేడాది అక్టోబర్ నుంచి పనులు నిలిచిపోయిన వి షయం తెలిసిందే. విచారణలో భాగంగా పరిశీలన చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు.