బకాయిల వసూలుకోసం ప్రత్యేక బృందాలు
మొండి బకాయిదారులకు నోటీసులు జారీ
ఇప్పటివరకు 50శాతం ఆస్తిపన్ను వసూలు
మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 13 : మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆస్తిపన్ను వందశాతం వసూ లు చేసేందుకు సిబ్బంది, అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘంలో 45,147 గృహాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నా యి. వీటి నుంచి రూ.22కోట్ల 53లక్షల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.12కోట్ల ఆస్తిపన్ను వసూ లు చేశారు. ఇంకా రూ.10కోట్లపైగా వసూ లు కావాల్సి ఉంది. ప్రత్యే క బృందాలు ఇంటింటికెళ్లి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నాయి.
విస్తృత ప్రచారం
ఆస్తిపన్ను చెల్లింపుపై మున్సిపల్ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో బ్యానర్లను ఏర్పాటు చేయడంతోపాటు ఆటోలతో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మొండి బకాయిదారుల జాబితాను రూపొందించి సెల్ఫోన్లకు ఆస్తిపన్ను సమాచారం పంపిస్తున్నారు. స్పందించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. మొండి బకాయిదారుల పేర్లను మున్సిపల్ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. మార్చి 31వ తేదీలోగా వందశాతం ఆస్తిపన్ను వసూలు చేసే దిశగా చర్య లు చేపడుతున్నారు.
పట్టణాభివృద్ధికి సహకరించాలి
ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూలుపై ప్ర త్యేక దృష్టి సారించాం. పట్టణంలో బ్యా నర్ల ఏర్పాటుతోపాటు ఆటోలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. మార్చి 31వ తేదీలోగా వందశాతం ఆస్తిపన్ను వసూలు చేస్తాం.
– ప్రదీప్కుమార్, మున్సిపల్ కమిషనర్,