గద్వాల న్యూటౌన్, నవంబర్ 30 : జోగుళాంబ గ ద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం దొంగలు హల్చల్ చేశారు. ఇంటికి వేసి తాళాన్ని పగులగొట్టి బంగారు ఆభరణాలు, వెండితోపాటు నగదును ఎత్తుకెళ్లారు. బాధితు లు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. జిల్లా కేంద్రంలోని లింగంబాగ్ కాలనీలో షేక్ ముసవీర్ అహ్మద్ మీ సేవ నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నా డు. హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా.. అందులో భాగంగా పాస్ట్పోర్టు వెరిఫికేషన్ ఉండడంతో గత నెల 27న కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. అతడి చిన్న కొడుకు నేహాల్ కూడా సోమవారం రాత్రి పనుల నిమిత్తం కర్నూల్కు వెళ్లి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి వే సిన తాళం విరగ్గొట్టి ఉండడంతో వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. అల్మారాలోని 19.8 తులాల బంగారం, రూ.1.75 లక్షల నగదు, 500 గ్రాముల వెండి అపహరణకు గురైనట్లు గుర్తించాడు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. నిందితుల వేలిముద్రలు, ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. డాగ్స్కాడ్తో గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా.. జిల్లా కేంద్రంలోని నల్లకుంట కాలనీలో అబ్దు ల్ బషీర్ ఇంట్లో కూడా చోరీ జరిగింది. ఇంటి తాళం ప గులగొట్టి రూ.20 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.