మూసాపేట, ఫిబ్రవరి 18 : పిల్లల దొంగలు వ చ్చారన్న వార్త మూసాపేటలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేటలోని కుమ్మరి గేరిలో రెండ్రోజులుగా బియ్యం అమ్ముతారా అంటూ నలుగురు వ్యక్తులు తిరుగుతున్నారు. ఈక్రమంలో ఆదివారం కుమ్మరిగేరిలోని జ్యోతి, నాగేశ్ కూలి పనులకు వెళ్లగా వారి ఎనిమిదేండ్ల కుమారుడు గుణశేఖర్ ఇంటి వద్దే ఉన్నాడు. మధ్యాహ్నం వేళ ఇంటి వద్దకు వచ్చిన దుండగులు ఆ పిల్లవాడి ని బియ్యం ఉన్నాయా? అని అడుగగా లేవని చె ప్పాడు. కాగా వారు అంగి గల్లా గట్టిగా పట్టుకొని సందులోకి ఈడ్చుకెళ్తుండగా గుణశేఖర్ కేకలు పె డుతూ ఏడ్చాడు.
దీంతో చుట్టుపక్కల పిల్లలు రావడంతో దుండగులు బాలుడిని వదిలిపెట్టి పారిపోయారు. విషయం కాస్త ఊళ్లో తెలియడంతో గ్రా మస్తులు వెంటనే ఆటోలో నలుగురు వ్యక్తులు పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారని మైకులో చాటిం పు వేయించారు. ఎంత వెతికినా వారు కనిపించకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు వెంటనే ఎస్సై సుజాతకు సమాచారమివ్వగా సిబ్బందిని పంపి ఘటనపై ఆరా తీశారు. ఈ విషయంపై పో లీసులు నిజం తేల్చాల్సి ఉన్నది.