అయిజ, జూలై 19 : నాణ్యతా ప్రమాణాలతో నాలుగు లేన్ల హై లెవల్ వంతెన ని ర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నా రు. బుధవారం పట్టణంలోని పెద్దవాగుపై రూ.5.70కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నా లుగు లేన్ల హై లెవల్ వంతెన పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిజ ప ట్టణం దినదినాభివృద్ధి చెందుతుండటం తో పెద్దవాగుపై శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెనను నిర్మిస్తున్నామన్నారు. పట్టణ జనాభా పెరుగుతుండడంతో ప్రజల సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రె డ్డి, ఈఎన్సీతో చర్చించి టెండర్ పూర్తి చే యించామన్నారు. ప్రభుత్వం రూ. 7కోట్లు విడుదల చేసిందన్నారు. రూ. 5.70కోట్లతో ఎల్ఎస్ఆర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సుధీర్రెడ్డి పను లు దక్కించుకుని బ్రిడ్జి పనులు చేపట్టారన్నారు. మూడు నెలల్లో పూర్తి చేసేలా చ ర్యలు తీసుకుంటామన్నారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.15 కోట్లతో పట్టణంలోని ప్రధాన రహదారిపై డివైడర్, సెం ట్రల్ లైటింగ్, పట్టణ ప్రకృతి వనాలు, అ త్యాధునిక వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేశామన్నా రు. ఐకమత్యంతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీలకతీతంగా కలిసొస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నా రు. కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈ కిర ణ్, ఏఈ మహేశ్, కౌన్సిలర్లు సురేశ్, న ర్సింహులు, రైతుసంఘం అధ్యక్షుడు నా గిరెడ్డి, ఎల్ఎస్ఆర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లి మిటెడ్ ప్రతినిధులు, రాముడు
తదితరులు పాల్గొన్నారు.