కొల్లాపూర్, మార్చి 6 : ప్రజలకు ఆచరణలో అమలు కాని హామీలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇ చ్చిన ప్రతి హామీని అమలుపర్చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్కు ఎలాంటి ఫీజులేకుండా ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీరం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ముందు గా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాశ్రావు, ఎంపీపీలు కమలేశ్వర్రావు, రజితాభాస్కర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి నాయకులతో కలిసి మాజీ ఎమ్మె ల్యే ఆర్డీవో నాగరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం బీరం విలేకరులతో మాట్లాడుతూ హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం ఎవరూ డబ్బులు చెల్లించొద్దని, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా అమలు చేస్తామని నాడు హామీలిచ్చిన ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేడు వాటి ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. తమ ప్రభుత్వంలో ఒక న్యాయం మీ ప్రభుత్వంలో మరో న్యాయ మా అని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి, జిల్లా మంత్రి సొంత గ్రామంలోని గో డౌన్ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ ఉంచిన సీఎంఆర్ ధాన్యం బస్తాలను దోచుకెళ్లిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో అసలు దోషులను వదిలేసి కేవలం కూలీలను అరెస్ట్ చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. సర్కారు ధాన్యం దొంగలించిన అసలు దొంగలను అరెస్ట్ చేసే వరకు తాము ప్రభుత్వం పై ఎంతటికైనా పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్సభ్యుడు మతీన్అహ్మద్, మాజీ జెడ్పీటీసీ జంబులయ్య, సింగిల్విండో చైర్మన్ చింతకుంట శ్రీనివాసులు, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు రామచందర్యాదవ్, సత్యనారాయణగౌడ్, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ శంకర్నాయక్, కౌన్సిలర్ కృష్ణమూర్తి, ము న్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రుక్మద్దీన్, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్, గుజ్జుల పరమేశ్, మూలే కే శవులు, సురేందర్రావు, కట్టా శ్రీనివాసులు, రాఘవేంద్ర, చంద్రశేఖర్శెట్టి, సాంబశివుడుయాదవ్, సాయిరాంయాదవ్, రామకృష్ణ, ని రంజన్, సురేందర్గౌడ్ తదితరులున్నారు.