వనపర్తి, ఏప్రిల్ 4 : ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం మరింత పెంపొందుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిట్యాలలోని నూతన శివాలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నిరంజన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో ఐక్యతాభావం పెరుగుతుందన్నారు. అనంతరం ఆలయ నిర్మాణ దాతలను వారు సత్కరించారు. అదేవిధంగా మాజీమంత్రి దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రావ్, మాజీ సర్పంచ్ భానుప్రకాశ్రావు, జితేంద్రరావు, విష్ణురావు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.