వనపర్తి, ఫిబ్రవరి 14 : సమాజంలోని వ్యవస్థలలో పని చేస్తున్నప్పుడు నిస్వార్థంగా సేవలందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ మంత్రి తన నివాసంలో నూతనంగా ఎన్నికైన జిల్లా గిరిజన సేవా సమితి నాయకులను శాలువా కప్పి అభినందిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ చేయడానికి అందరికీ అవకాశం రాదని, వచ్చిన వారు తప్పక సమయం కేటాయించి సేవలందిస్తే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
చేసే పనిలో వివాద రహితులుగా గుర్తింపు తెచ్చుకోవాలని వారికి సూచించారు. అనంతరం జి ల్లా గిరిజన సేవా సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ముడావత్ చంద్రూనాయక్, కమిటీ సభ్యులు నారాయణనాయక్, జహంగీర్నాయక్, గౌరవ అ ధ్యక్షుడు కృష్ణానాయక్ను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో ఖిల్లాఘణపురం ఎంపీపీ కృష్ణానాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్నాయ క్, హనుమంతునాయక్, శ్రీధర్నాయక్, అర్జున్నాయక్ తదితరులు పాల్గొన్నారు.