వనపర్తి, ఫిబ్రవరి 28 : పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లు కలిసికట్టుగా ముందుకు సాగాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో అసంతృప్తి కౌన్సిలర్లతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పాల్గొని సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఏర్పడిన నాలుగేండ్ల 2 నెలల్లో అనేక పనులను విజయవంతంగా చేపట్టామని, దానికి కౌన్సిలర్లు కూడా ఎంతోగానో సహకరించారన్నారు. జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ, రోడ్ల విస్తరణ, అంతర్గత రోడ్లు పూర్తి కావచ్చాయని, మిగిలిపోయిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. ప్రజలు బీఆర్ఎస్పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీఅందరిపై ఉందన్నారు. వచ్చే పార్లమెంట్, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలన్నారు.
అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, లేకపోతే ఇతర పార్టీలతో చులకన కావాల్సి వస్తుందని హితవు పలికారు. అనంతరం రెండు రోజుల కిందట కలెక్టర్కు ఇచ్చిన ఆవిశ్వాస నోటీస్పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అందరి అభిప్రాయం మేరకు తాము స్వచ్ఛందంగా పదవులకు రాజీనామా చేస్తామన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని మాజీ మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుట్టపాకల మహేశ్, బండారు కృష్ణ, నాగన్నయాదవ్, లక్ష్మీనారాయణ, పాకనాటి కృష్ణ, జంపన్నయాదవ్, నందిమల్ల శ్యామ్,కో ఆప్షన్ సభ్యుడు గులాం ఖాదర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్, నాయకులు శేఖ ర్, అశోక్, శ్రీను, శరవంద, గోపాల్యాదవ్, పాల్గొన్నారు.