వనపర్తి, డిసెంబర్ 7 : ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి నిత్యం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. గురువారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడు ప్రజలు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని, అందుబాటులో ఉండాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని చెప్పారు. తానూ ఎల్లవేళలా ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. ఎప్పటిలాగానే ప్రతి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు గత తొమ్మిదిన్నర ఎండ్లలో చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు కొనసాగే విధంగా అధికారులను సంప్రదించి ముందుకు సాగేలా కృషి చేయాలని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు నందిమళ్ల అశోక్, ప్రేమ్నాథ్రెడ్డి, సర్పంచ్ చిన్నారెడ్డి, మల్లయ్య, దేవర్ల నర్సింహ, నక్క మహేశ్, సురేశ్, బాలస్వామి, సత్యం తదితరులు పాల్గొన్నారు.