పెద్దమందడి, డిసెంబర్ 21 : మండలంలోని దొడగుంటపల్లిలో గురువారం అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమం ఘ నంగా నిర్వహించారు. గురుస్వామి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో రమేశ్శర్మ, పవన్శర్మ, చిట్యాల నరేందర్ గురుస్వామిల సమక్షంలో మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పా డిపంటలతో కళకళలాడాలని, గ్రామస్తులం తా సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం అయ్యప్ప, ఆం జనేయస్వామి మాలధారులు, గ్రామస్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు అశోక్రెడ్డి, వెంకటేశ్, సాయికుమార్, ఆంజనేయులు, చంద్రశేఖర్రెడ్డి, సంతోష్, నాగేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.