వనపర్తి, మార్చి 9 : రానున్న స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో విజయం మనదేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు భిన్నంగా ఉండబోతుందని ఆ యన ధీమా వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని త న నివాసంలో పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన విధివిధానాలపై వనపర్తి మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో నిరంజన్రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి తిరకాసులు పెడుతూ కాలయాపన చేస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ఈ పదేండ్లలో కేసీఆర్ రైతులకు సాగునీటిని ఏప్రిల్ వరకు అందిస్తే కాంగ్రెసోళ్లు గెలిచిన మరుసటి రోజు నుంచే కాల్వ నీళ్లు బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు యాసంగి పంటలకు నీరులేక అన్నదాతలు పశువులకు వదిలేస్తున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనని ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఏ కార్యకర్తకూ అన్యాయం చేయలేదని తేల్చి చెప్పారు. అవకాశవాద రాజకీయాలు చేసేవారే పార్టీని వీడుతున్నారని, అటువంటి వారితో ఎప్పటికైనా పార్టీకి నష్టమేనని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న నాయకుల మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని.. అంతే నమ్మకంతో వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి కసిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కష్టకాలంలో తనతో క లిసి నడిచిన వాళ్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. నియోజకవర్గంలో తమ ప్రభుత్వం చేసిన పనులే తప్పా కాంగ్రెసోళ్లు వచ్చాక చేసిందేమీ లేదని.. ఇంకా పూర్తి కావాల్సిన పనుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తి డి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రె స్పై వ్యతిరేకత మొదలైందని, ఈ రెండు నెలలు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గ ట్టుయాదవ్, మండల అధ్యక్షుడు మాణిక్యం, అధికార ప్రతినిధి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ఎంపీటీసీలు రంగారెడ్డి, ధర్మానాయక్, ధర్మశాస్త్రి, సీనియర్ నాయకులు లక్ష్మయ్య, కురుమూర్తియాదవ్, రాములుయాదవ్, చెన్నరాములు, వెంకటేశ్, చంద్రశేఖర్నాయ క్, విజయ్, శ్రీనివాసులు, రాజేశ్వరి పాల్గొన్నారు.