వనపర్తి టౌన్, ఆగస్టు 11 : వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో ఇటీవల సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించి కాసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి పరిశుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించిన విషయం విధితమే.. ఈ సందర్భంగా తాను స్వయంగా భోజనం తయారు చేయించి ఏర్పాటు చేస్తానన్న హామీ మేరకు మంగళవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యా యులు , అధికారులు విద్యతోపాటు క్రమశిక్షణ, సమాజంలోని పరిస్థితుల పై అవగాహన కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పరంగా నిర్వహించే విద్యా సంస్థల్లో పర్యటనలు చేస్తూ విద్యా వసతులు, మౌలిక వసతులు , ఆహార నాణ్యతమై శ్రద్ధపెట్టి మెరుగుపర్చాలని తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారని అన్నారు.
భోజనం అనంతరం వి ద్యార్థిని విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి మనకు ఆ హారాన్ని అందించే రైతు, రైతు కూలీల విశిష్టత తెలిపి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులను, రైతులను గౌరవించాలని ఉద్భోందిచారు. అనంతరం కాసేపు విద్యార్థులతో ముచ్చటించి ఉత్సాహపరిచారు. అనంతరం మాజీ మంత్రి వనపర్తి మండలం కిరియాతండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణనాయక్ ఇటీవల వెన్నెముక శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లి ప రామర్శించారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ నా యకులు మాణిక్యం, రఘువర్ధన్రెడ్డి, ధర్మానాయక్, మా ధవరెడ్డి, రవిప్రకాశ్రెడ్డి, చిట్యాల రాము, కిష్టనాయక్, శంకర్నాయక్, సక్రూ నాయక్, పిరు నాయక్, సేనాపతి, శాంతమ్మ, దేవకుమార్, మహేశ్వర్రెడ్డి, నరేశ్, రాజు, యాదగిరి, వాసు, తిరుపతయ్య, స్వామి పాల్గొన్నారు.