నాగర్ కర్నూల్: కుమ్మేరా జాతర (Kummera jatara) లో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) డీజీపీకి ఫిర్యాదు చేశారు. సోమవారం హైదరాబాద్లోని కార్యాలయంలోకి వెళ్లి డీజీపీ శివధర్ రెడ్డికి ( DGP Shivadhar Reddy ) వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల పసికందును తన్ని చంపినా వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్ చారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, నేతలు స్వామి యాదవ్ ,రాజు తదితరులున్నారు.