మిడ్జిల్, మే 10: తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీలు నెరవేర్చకుండా ఓట్లు ఎలా అడుగుతారని బీఆర్ఎస్ అ ధ్యక్షుడు లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. నమ్మించి మోసం చే సిన కాంగ్రెస్ నాయకులకు ఓటు వేయొద్దని ఓటర్లకు చెప్పారు. వారికి బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్ర చారంలో భాగంగా రోడ్షోలో పాల్గొని మాట్లాడారు. రైతుబంధు రాలేదు, రుణమాఫీ లేదు, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం లేదు. ఒక్క హామీని కూడా అమలుచేయని సీఎం రేవంత్రెడ్డిని మళ్లీ న మ్మొదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖబాలు, పీఏసీసీ ఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు సుధాబాల్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జైపాల్రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, శేఖర్, వెంకట్రెడ్డి, కరుణాకర్రెడ్డి, బీంరాజు, బంగారు, జగన్గౌడ్ ఉన్నారు.