అమ్రాబాద్, ఏప్రిల్ 7 : అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ పడమర బీట్ తాళ్లచెల్క, గుండం ఏరియాలో అకస్మాత్తుగా శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సి బ్బంది అర్ధరాత్రి రెండు గంటల వరకు తీవ్రంగా శ్ర మించి మంటలను అదుపులో కి తీసుకొచ్చారు.
అటవీశాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడికి సమాచారం అందించగా, అమ్రాబాద్, మ న్ననూర్ అటవీశాఖ అధికారులు ఆదిత్య, ఈశ్వర్ బీట్ అధికారులు క్యాంప్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.