రైతుల అభ్యున్నతికి, పేద విద్యార్థుల విదేశీ ఉన్నత చదువులకు డీసీసీబీ రుణాలు అందించి అండగా నిలుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా విదేశీ విద్య కోసం కరకాల హేమంత్రెడ్డికి డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి రూ.23లక్షల చెక్కును అందజేసి విద్యార్థిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ రైతులకు ఇల్లు కట్టుకోవడానికి రుణసదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.
వనపర్తి జూలై 27 (నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్ : గ్రామీణ ప్రాం తాల్లో రూరల్ హౌసింగ్ పాలసీని అమ లు చేస్తూ రైతులు ఇండ్లు కట్టుకునేందుకు రుణాలు అందించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అ న్నారు. రైతు బిడ్డలు విదేశాల్లో చదువుకునేందుకు డీసీసీబీ ద్వారా రుణాలు అం దించేందుకు నూతన పథకం విద్యాకానుకను అమలు చేస్తునట్లు మంత్రి తెలిపా రు. బుధవారం జిల్లాకు చెందిన విద్యార్థి కరకాల హేమంత్రెడ్డి అమెరికాలో విద్య ను అభ్యసించేందుకుగానూ రూ.23 లక్షల విద్యారుణాన్ని మంత్రి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి అందజేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ రైతులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రుణాలే కాకుండా వ్యవసాయేతర రుణాలను వారి అభివృద్ధికి అనుగుణం గా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీసీసీబీ ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని తెలియజేశారు. కా ర్యక్రమంలో డీసీసీబీ జనరల్ మేనేజర్ లక్ష్ష్మయ్య, వెంకటేశ్ ఉన్నారు.