గద్వాల, జూన్ 17 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రతిరోజూ జూరాలకు వరద తగ్గుతూ పెరుగుతూ ఉన్నది. సోమవారం ఎగువ నుంచి 6,691 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తు తం 8.869 టీఎంసీలు ఉన్నది. కాగా నెట్టెంపాడ్ లిఫ్ట్కు 375, భీమా లిఫ్ట్-1కు 650, కోయిల్సాగర్ లిఫ్ట్కు 315, సమాంతర కాల్వకు 800, భీమా లిఫ్ట్-2కు 583 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో అవుట్ఫ్లో 2,779 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అయిజ, జూన్ 17 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్ప వరద కొనసాగుతున్నది. 4,329 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 4,329 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని ఏఈ రాందాస్ తెలిపారు. ప్ర స్తుతం ఆనకట్టలో 8.6 అడుగుల నీటిమట్టం ఉన్నది.
తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. 1,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 301 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం 100.855 గరిష్ఠ నీటి నిల్వ సా మర్థ్యానికి గానూ ప్రస్తుతం 6.070 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.