ఉండవల్లి, ఫిబ్రవరి 19: శివరాత్రి సందర్భంగా దైవదర్శ నం చేసుకొని వస్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారు జామున ఉండవల్లి మండలం బైరాపురం గ్రామ శివారులో చోటుచేసు కున్నది. ఎస్సై బాలారాజు, స్థానికుల కథనం మేరకు మానవ పాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (15), సాయికుమార్గౌడ్(15), రఫీ(16) ముగ్గురు స్నేహి తులు. శివరాత్రిని పురస్కరించుకొని శనివారం సాయంత్రం ముగ్గురూ బైక్పై అలంపూర్ జోగుళాంబదేవి ఆలయానికి వెళ్లారు. అమ్మవారు, బాలాబ్రహ్మేశ్వరస్వామిని దర్శించు కొని రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, ఆకాశ జ్యోతి అనంతరం అర్ధరాత్రి స్వగ్రామానికి వెళ్తుండగా బైరాపు రం శివారులో అలంపూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో చంద్ర శేఖర్, రఫీ, సాయికుమార్గౌడ్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వాహన దారులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సూర్యనాయక్, ఎస్సై బాలా రాజు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను అలంపూర్ ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. మృతుల కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. ముగ్గురు మిత్రుల మృతితో కొర్విపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డుప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులను ఎమ్మెలే అబ్రహం పరామర్శించి బాధితకుటుం బాలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అలాగే జిల్లా ఎస్పీ సృజన ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 19 : ద్విచక్రవాహనంపై దైవదర్శనానికి వెళ్తున్న వారిని రాంగ్రూట్లో వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అడ్డాకుల ఎస్సై విజయ్కుమార్, స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్నగర్ పట్టణం షాషాబ్గుట్టకు చెందిన గోపికృష్ణ(20) అదేకాలనీకి చెందిన అతని స్నేహితుడు సాయికిరణ్తో కలిసి ఆదివారం బైక్పై కొత్తకోట మండలం పామాపూరం ఆలయానికి వెళ్తుండగా అడ్డాకుల మండలం స్నేహ పరిశ్రమ సమీపంలో రాగ్రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో గోపికృష్ణ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా సాయికిరణ్కు గాయా లు కావడంతో జిల్లా దవాఖానకు తరలించారు. కేసునమో దు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
వీపనగండ్ల, ఫిబ్రవరి 19: మరో నాలుగు రోజుల్లో శుభ కార్యం జరగాల్సిన ఓ కుటుం బంలో తండ్రి మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం మండలం లోని గోవర్ధనగిరి గ్రామశి వా రులో చోటుచేసుకున్నది. ఎస్సై రామన్గౌడ్ కథనం ప్రకారం కొల్లాపూర్ మండలం రాంపు రం గ్రామానికి చెందిన ఆకునమోని ఖాదర్(45) తన పెద్ద కుమారుడు మహేశ్ వివాహం ఈ నెల 24న నిర్వహిం చేం దుకు నిశ్చయించారు. పెండ్లి పత్రికలు పంచేందుకు చిన్న కుమారుడు అన్వేష్తో కలిసి బైక్పై ఆదివారం పెబ్బేర్ మం డలం అయ్యవారిపల్లి గ్రామానికి వెళ్లాడు. బంధువులకు పత్రికలు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా గోవర్ధనగిరి వెలగొండ గ్రామాల మధ్య మలుపువద్ద బైక్ అదుపుతప్పి కిందపడడంతో ఖాదర్ అక్కడికక్కడే మృతి చెందగా అన్వేష్కు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ అన్వేష్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని వనపర్తి ఏరియా దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహిం చినట్లు ఎస్సై తెలిపారు.