పెబ్బేరు, మార్చి 10 : శాస్త్రీయ పద్ధతిలో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ర వీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరులోని మ త్స్య కళాశాలలో రాష్ట్ర మత్స్యశాఖ, జాతీయ మ త్స్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 30 మంది మత్స్య రైతులకు చే పల ఉత్పత్తిపై ఐదు రోజుల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి ప్రారంభించ గా, ముఖ్య అతిథిగా ఉపకులపతి హాజరై మాట్లా డారు. శాస్త్రీయ పద్ధతుల్లో చేపలు పెంచి లబ్ధిపొందాలని సూచించారు. నాగలక్ష్మి మాట్లాడుతూ ప్ర ధాని మత్స్య సంపద యోజన పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కమ్యూనిటీ చెరువు ల్లో నిల్వ చేసే చేపల జాతుల గురించి వివరించా రు. చేపల పెంపకంపై మెళకువల పుస్తకాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం అనూష, ముత్తప్పఖవి, హోన్నానంద, భానుప్రకాశ్, దేవానంద్, శ్రీను, మోహన్ పాల్గొన్నారు.