కోడేరు, జనవరి 16 : మండలంలోని ఎత్తం గ్రామ శివారులోని ఎత్తం గట్టుపై వెలిసిన రామలింగేశ్వరస్వా మి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఏటా సంక్రాంతి సందర్భంగా రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత ఎతైన ఎత్తం గట్టుపై కొలువుదీరిన రామలింగేశ్వరస్వామిని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రా ష్ర్టానికి చెందిన భక్తులు లక్షలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు స్వామి వారి వద్దకు గట్టుకి వెళ్లలేని భక్తులు కోడేరు వైపు న ఉన్న ముఖద్వారం వద్ద మొక్కులు చెల్లించుకున్నా రు. ఎత్తం వైపున ఉన్న ముఖద్వారం వద్ద పెద్ద ఎత్తున జాతర ఏర్పాట్లు చేశారు. గట్టు కింద ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తులు ముందుగా దర్శనం చేసుకొని గ ట్టుపైకి ఎక్కారు. ఈ ఏడాది ఆంజనేయస్వామి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఆకుపూజలతోపాటు హోమం వివిధ రకాల పూజలు ని ర్వహించారు. ఎత్తం, కొండ్రావుపల్లి గ్రామాలకు చెంది న మాజీ ఎమ్మెల్యే హర్షన్న యువసేన నాయకులు భక్తులకు ఉచితంగా అన్నదానం చేశారు. ఈ అన్నదాన కా ర్యక్రమాలను బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. కొండ్రావుపల్లి మాజీ సర్పంచ్ కలమందరాజేశ్, సాయికుమార్, రమేశ్, మల్లయ్య, మారుతి తదితరులు సొంత ఖర్చుతో భక్తులకు అన్నదానం చేశారు.