చారకొండ, మార్చి 26 : మండలంలోని జూ పల్లి గ్రామానికి చెందిన క డారి తిరుపతయ్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఐదు రోజుల కిందట హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ మంగళవారం మృతి చెందాడు. అతని కూతురు పావని అదే గ్రా మంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం వార్షిక పరీక్షలు రాస్తున్నది. తండ్రి మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంతో పరీక్ష రాసింది. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నది.